కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 9 మండలాల పరిధిలో భూసేకరణ జరుగుతుంది. చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, నకిరేకల్, కేతేపల్లి, చివ్వెంల, కోదాడ, మునగాల మండలాల్లోని సుమారు 40 గ్రామాలను ఈ విస్తరణలో చేర్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పరిధిలో నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, వెస్ట్, నార్త్ మండలాల్లోని గ్రామాల భూములను సేకరించనున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆయా ప్రాంతాల ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లను నియమించారు.