హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఆదివారం ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, పూర్తి వివరాలు

Published : Aug 29, 2026, 09:14 PM IST

Hyderabad: నగరంలో ఆదివారం నిర్వహించనున్న హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మారథాన్ జరిగే ప్రధాన రహదారులపై ఉదయం వేళల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు.

PREV
14
ఈ స‌మ‌యంలో ఆంక్ష‌లు

ఆగస్టు 30న తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఉదయం 9:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి. ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు మారథాన్ రూట్

మారథాన్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై నగరంలోని పలు కీలక ప్రాంతాల మీదుగా సాగనుంది. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ పరిసరాలు, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా రన్నర్లు గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియం వైపు చేరుకోనున్నారు. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు ఉండే అవకాశం ఉండటంతో భద్రతా చర్యల్లో భాగంగా ట్రాఫిక్‌ను పరిమితం చేయనున్నారు.

24
నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో ప్రత్యేక నియంత్రణ

మారథాన్ నేపథ్యంలో నెక్లెస్ రోడ్ వైపు వెళ్లే వాహనాలపై ప్రత్యేక ఆంక్షలు విధించనున్నారు. ముఖ్యంగా మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ ప్రాంతాల నుంచి నెక్లెస్ రోడ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించే అవకాశం ఉంది. లిబర్టీ, కర్బాలా, ముషీరాబాద్ ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనదారులు కూడా ట్రాఫిక్ మళ్లింపులను గమనించి ప్రయాణించాలని అధికారులు సూచించారు.

34
పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వరకు మార్గాల మార్పు

పంజాగుట్ట, రాజ్‌భవన్ వైపు వెళ్లే వాహనాలకు కూడా మారథాన్ సమయంలో మార్గాల మార్పులు ఉంటాయి. షాదాన్–రవీంద్రభారతి మార్గం ద్వారా వాహనాలను మళ్లించనున్నారు. అదే విధంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు రోడ్ నంబర్ 10, రోడ్ నంబర్ 12, క్యాన్సర్ హాస్పిటల్ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు. బేగంపేట నుంచి రాజ్‌భవన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలను గ్రీన్‌లాండ్స్ జంక్షన్ వద్ద దారి మళ్లించనున్నారు.

44
ఫ్లైఓవర్లు, కీలక జంక్షన్ల వద్ద ఆంక్షలు

మారథాన్ రూట్‌లోని పంజాగుట్ట ఫ్లైఓవర్, సాగర్ సొసైటీ, ఎన్‌టీఆర్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. సైబరాబాద్ కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వైపు వెళ్లే వాహనాలకు కూడా పరిమితులు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉదయం 4:30 నుంచి 9 గంటల మధ్య నగరంలోని ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్ సిబ్బంది సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. మారథాన్ కారణంగా కొంతసేపు ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉన్నందున అత్యవసర ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories