ఈ ఘటన అందరికీ ఒక పెద్ద గుణపాఠం. సోషల్ మీడియా వాడకం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు అవసరం.
* తెలియని అకౌంట్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఆకర్షణీయమైన ఫోటోలు, తీపి మాటలు చూసి వెంటనే నమ్మకూడదు.
* వ్యక్తిగత విషయాలు షేర్ చేయొద్దు. ఫోటోలు, వీడియోలు, ఫోన్ నంబర్, అడ్రస్ లాంటి సమాచారం ఎవరికీ ఇవ్వకూడదు.
* ఆన్లైన్ పరిచయాలతో వ్యక్తిగత భేటీలు వద్దు ఎంత నమ్మకం వచ్చినా ఒంటరిగా కలవడం ప్రమాదమనే విషయాన్ని గుర్తించాలి.
* బ్లాక్మెయిల్ చేస్తే భయపడొద్దు. డబ్బులు ఇస్తే సమస్య తీరదని గుర్తించాలి. ఎక్కడ పరువు పోతుందా అని అస్సలు భయపడొద్దు. ముందుగా ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు ధైర్యంగా చెప్పండి. ఆ తర్వాత నేరుగా పోలీసులను సంప్రదించండి.
* సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగ్స్ చెక్ చేయాలి. మీ అకౌంట్ను, మీ పోస్టింగ్లను ఎవరు చూడాలి, ఎవరు మెసేజ్ చేయాలి అన్నది మన చేతిలో ఉండేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి.
* మొత్తం మీద సోషల్ మీడియా స్నేహాలు క్షణాల్లో ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఒక్క తప్పు నిర్ణయం జీవితాన్నే తలకిందులు చేయగలదు. ఈ కరీంనగర్ హనీట్రాప్ కేసు అందరికీ ఒక హెచ్చరిక. జాగ్రత్తగా ఉండడమే అసలైన రక్షణ.