గురువారం ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి.. ఇవి ఇవాళ(శుక్రవారం) కూడా వానలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కర్నూల్, నంద్యాల, సత్యసాయి, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. శని, ఆదివారం కూడా వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది.