భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో నేడు 20 సెంటీమీటర్లకు మించి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ప్రకటించింది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం కాకుండా బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, ఖమ్మం, జనగామ, కుమురం భీం ఆసిఫాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగతా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.