వాతావరణశాఖ హెచ్చరికల ప్రకారం గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాల్లో వరద ప్రమాదం ఉంది. ప్రాజెక్టులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్, హనుమకొండ జిల్లాలకు మరో 24 గంటలు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. పర్వతగిరిలో 34.8 సెం.మీ., రెబర్తిలో 17.4 సెం.మీ., దూల్మిట్టలో 15.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.