ముగిసిన పల్లెపోరు.. కొనసాగుతున్న రాజకీయ చర్చ
మూడో దశతో తెలంగాణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇంకా కొన్ని చోట్ల ఫలితాలు రావాల్సి ఉన్నప్పటికీ, మొత్తం ట్రెండ్లో పెద్ద మార్పు ఉండదని అంచనా. గ్రామస్థాయి రాజకీయాల్లో కాంగ్రెస్ బలపడిందని, బీఆర్ఎస్, బీజేపీ తమ వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 2331 స్థానాలను కాంగ్రెస్, 1168 బీఆర్ఎస్, 189 బీజేపీ, 539 స్థానాల్లో ఇతరులు గెలిచారు. రెండో దశలో కాంగ్రెస్ 2245 స్థానాలు, బీఆర్ఎస్ 1188, బీజేపీ 268, ఇతరులు 624 స్థానాలు గెలుచుకున్నారు. మూడో దశలో ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం.. 2224 స్థానాలు కాంగ్రెస్, 1149 బీఆర్ఎస్, 240 బీజేపీ, 488 స్థానాల్లో ఇతరులు గెలిచారు.
ఈ ఫలితాలు రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.