ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 45 నుండి 46 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లా కానుమోలులో హయ్యస్ట్గా 45.8°C రికార్డైంది.
ఇటు తెలంగాణలో కూడా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఎండతో జనం అల్లాడిపోతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు వేడి ఉంటోంది. మధ్యాహ్నం 1 గంట దాటిందంటే చాలు, జనం బయటకు రావడానికి భయపడుతుండటంతో రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి.