నైరుతి రుతుపవనాల జోరుతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వాన తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
ఇక ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా కల్లూరులో రికార్డు స్థాయిలో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.