సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక గురువారం సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, హైదరాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.