తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

Train: గంటలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లొచ్చు.. పట్టాలపై కాదు గాల్లో వెళ్లే రైలు గురించి తెలుసా?

Narender Vaitla | Published : May 30, 2025 4:34 PM

మనకు తెలిసినంత వరకు రైలు ఎంత వేగంతో వెళ్తుంది. ఏముంది గంటకు వంద లేదా అంతకంటే కాస్త ఎక్కువ అంటారా.? వందే భారత్ అయితే ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు. అయితే గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు ఉందని మీకు తెలుసా.?

15
గాలిలో ప్రయాణించే రైలు!

ప్రపంచంలో సాధారణంగా రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తాయి. ఇవి గంటల వ్యవధిలో వందల కిలోమీటర్ల దూరాన్ని పయనించగలవు. అయితే కొన్ని ప్రత్యేక రైళ్లు మాత్రం భూమిని తాకకుండా గాలిలో ప్రయాణిస్తాయి. ఇది నిజంగా వినడానికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ కొన్ని దేశాల్లో మాగ్లెవ్ టెక్నాలజీతో ఇది సాకారమవుతోంది.

25
మాగ్లెవ్ రైలు టెక్నాలజీ అంటే ఏమిటి?

జపాన్‌లో మాగ్లెవ్ అనే అధునాతన రైలు వ్యవస్థ అమలులో ఉంది. ఈ రైలు “Magnetic Levitation” టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో రైలు చక్రాలు ట్రాక్‌ను తాక‌వు. అయస్కాంత శక్తి ద్వారా గాల్లో తేలుతూ ప్రయాణిస్తుంది. దీంతో ఈ రైలు అత్యంత వేగంగా దూసుకెళ్తుంది.

35
ప్రపంచంలోనే వేగ‌మైన రైలు

జపాన్ అభివృద్ధి చేసిన SCmaglev రైలు గంటకు 600 కి.మీ. వరకు దూసుకుపోతుంది. ఇది భూమికి కొద్దిగా పైకి లెవిటేట్ అయి ప్రయాణిస్తుంది. సాధారణంగా ఈ రైలు ట్రాక్‌పై ఒక అంగుళం నుంచి ఆరు అంగుళాల మధ్య ఎత్తులో తేలి ఉంటుంది. వేగంగా ప్రయాణించడమే కాకుండా, శబ్దం తక్కువగా ఉంటుంది.

45
చైనాలో కూడా

జపాన్‌తో పాటు చైనా కూడా మాగ్లెవ్ రైళ్లను విజయవంతంగా నడుపుతోంది. అక్కడి రైళ్లు కూడా గంటకు 430 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. ఉదాహరణకి, ఢిల్లీ నుండి చండీగఢ్ వరకు ఉన్న దూరాన్ని అర్ధ గంటలో పూర్తిచేయగల శక్తి మాగ్లెవ్ రైళ్లకు ఉంది.

55
భారత్‌లో మాగ్లెవ్ రైలు

భారతదేశంలో కూడా మాగ్లెవ్ టెక్నాలజీపై పరిశీలనలు జరుగుతున్నాయి. జపాన్ సహకారంతో ఈ సాంకేతికతను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రవాణా ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు, వేగం, సౌకర్యం విషయంలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఒక‌వేళ భార‌త్‌లో ఈ రైళ్లు అందుబాటులోకి వ‌స్తే హైద‌రాబాద్ నుంచి తిరుప‌తికి కేవ‌లం గంట‌లో దూసుకెళ్లొచ్చ‌న్న‌మాట‌.

Read more Photos on
click me!
Recommended Photos