Published : Dec 03, 2025, 04:33 PM ISTUpdated : Dec 03, 2025, 05:40 PM IST
Virat Kohli : రాయ్పూర్ వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో టీమిండియా ఇన్నింగ్స్కు పరుగులు పెట్టించాడు. ఇది తనకు వరుసగా రెండో సెంచరీ. అంతర్జాతీయ కెరీర్లో 84వ సెంచరీ. దీంతో సచిన్ రికార్డు దిశగా మరో అడుగు పడింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. దక్షిణాఫ్రికాతో రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ సిరీస్లో బౌలర్లు, కఠినమైన పిచ్ పరిస్థితులు ఇరు జట్లను పరీక్షించినప్పటికీ, కోహ్లీ మాత్రం తనదైన ఆటతో సెంచరీ కొట్టాడు. సిరీస్ ఆరంభ మ్యాచ్లోనూ అద్భుత సెంచరీతో రాణించిన కోహ్లీ.. అదే అద్భుతమైన ఫామ్ను ఈ మ్యాచ్లోనూ కొనసాగించాడు.
బ్యాటింగ్ కు ఇబ్బంది కలిగించే పిచ్ పై కోహ్లీ మరోసారి టీమిండియా ఇన్నింగ్స్కు వెన్నెముకగా మారాడు. ఎటువంటి ఒత్తిడి లేకుండా సులభంగా స్ట్రైక్ను రొటేట్ చేస్తూ, సరిగా పడని బంతులను సైతం ఖచ్చితమైన షాట్లతో అదరగొట్టాడు. వేగం, అద్భుతమైన షాట్ ఎంపిక, క్రీజులో అతని ప్రశాంతమైన స్వభావం కారణంగా, దక్షిణాఫ్రికా బౌలర్ల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ మ్యాచ్పై నిలకడగా పట్టు సాధించింది. మొత్తంగా కోహ్లీకి ఇది సఫారీలపై వరుసగా మూడో సెంచరీ. వన్డే ప్రపంచకప్ 2023లో కోల్కతాలో 101* సెంచరీ బాదిన కోహ్లీ.. రాంచీలో 135 పరుగులు, రాయ్ పూర్ లో 102 పరుగులతో సెంచరీలు బాదాడు. ఈ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
25
వరుస సెంచరీలతో కింగ్ కోహ్లీ సూపర్ ఫామ్
ఈ సెంచరీ కోహ్లీకి ఈ సిరీస్లో వరుసగా రెండోది కావడం విశేషం. దీంతో వన్డే క్రికెట్లో అతడు ఎందుకు గొప్ప బ్యాటర్గా కొనసాగుతున్నాడో మరోసారి స్పష్టమైంది. ఈ సెంచరీ మరింత ప్రత్యేకంగా మారింది. ఇది అతడి అంతర్జాతీయ కెరీర్లో 84వ సెంచరీ కావడం విశేషం.
ఈ సెంచరీతో, కోహ్లీ తన లెగసీని మరింత బలోపేతం చేసుకున్నాడు. అభిమానులను సంతోషపరుస్తూ, తన గొప్ప వన్డే కెరీర్లో మరో అద్భుతమైన అధ్యాయాన్ని లిఖించాడు. పెద్ద మ్యాచ్లలో మెరుపులు మెరిపించే ఆటగాడిగా పేరున్న కోహ్లీ, మైలురాయిని దాటిన తర్వాత రాయ్పూర్ అభిమానులు హర్షధ్వానాలతో అదిరిపోయింది. ఈ సిరీస్లో కోహ్లీ ఒత్తిడిని అవకాశాలుగా మలుచుకుని, తన ఫామ్పై వచ్చిన ప్రశ్నలకు బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు.
35
సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డుకు మరింత చేరువైన కోహ్లీ
దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలతో విరాట్ కోహ్లీ మరోసారి సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డుకు చేరువయ్యాడు. రాయ్పూర్లో తన 84వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేసిన ఈ స్టార్ ప్లేయర్.. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో ప్రపంచ రికార్డును ఛేదించే దిశగా పయనిస్తున్నాడు.
ఈ సెంచరీతో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో స్వదేశంలో తన సెంచరీల సంఖ్యను 40కి పైగా పెంచుకున్నాడు. ఈ లెజెండరీ జాబితాలో సచిన్ టెండూల్కర్ (42 సెంచరీలు) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నాడు. కోహ్లీ 2027 వరకు వన్డే క్రికెట్ ఆడితే, టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టే గొప్ప అవకాశం అతనికి ఉంటుంది.
కోహ్లీ కేవలం 90 బంతుల్లోనే ఇక్కడ సెంచరీ కొట్టి ఈ ఫార్మాట్లో తన స్ట్రైక్ రేట్ను గణనీయంగా మెరుగుపరిచాడు. వన్డే సిరీస్కు ముందు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై అనేక చర్చలు జరిగాయి. వరుసగా రెండు సెంచరీలతో, అతడు ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినట్టే.
55
వన్డేల్లో అత్యధిక స్టేడియాల్లో సెంచరీల రికార్డు సమం
రాంచీలో జరిగిన మొదటి మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసిన కోహ్లీ, సరిగ్గా అక్కడి నుంచే మళ్లీ తన ఆటను కొనసాగించాడు. రాయ్పూర్లో దక్షిణాఫ్రికాపై 90 బంతుల్లో సెంచరీ చేసి పరుగుల ప్రవాహాన్ని సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
కోహ్లీ తన వన్డే కెరీర్లో 11వ సారి వరుసగా సెంచరీలు సాధించాడు. 2016-2018 మధ్య కోహ్లీ తన ప్రైమ్ ఫామ్లో ఉన్నప్పుడు వరుస సెంచరీలు సాధించాడు. ఇలా వన్డే ఫార్మాట్ చరిత్రలో ఒక ఆటగాడిగా అత్యధిక వరుస సెంచరీల రికార్డును సాధించాడు. కోహ్లీ 84 అంతర్జాతీయ సెంచరీలతో, సచిన్ టెండూల్కర్ (100) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.