పలు రిపోర్టుల ప్రకారం.. కోహ్లీ మొదట్లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడటానికి ఆసక్తి చూపలేదు. కానీ, రోహిత్ శర్మ టోర్నమెంట్లో పాల్గొనడానికి అంగీకరించడంతో విరాట్పై ఒత్తిడి పెరిగింది. రోహిత్ ఆడుతున్నప్పుడు, ఒక ప్లేయర్కు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇవ్వాలనే ప్రశ్న తలెత్తింది.
ఈ నేపథ్యంలో బోర్డు కోహ్లీతో మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలాగే, కోహ్లీ నిరాకరించినట్లయితే, అది ఇతర ఆటగాళ్లకు తప్పుడు సందేశాన్ని పంపుతుందని బోర్డు ఆందోళన చెందింది. విరాట్కు బోర్డు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుందనే విమర్శలకు తావిచ్చే అవకాశం ఉంది. అందుకే, బీసీసీఐ సెలెక్టర్లు కోహ్లీతో మాట్లాడి, ఆయనను ఒప్పించారని సమాచారం.
బోర్డు ఒప్పించిన తర్వాత, కోహ్లీ తన సొంత జట్టు డీడీసీఏతో మాట్లాడారు. ఆయన జట్టులో చేరడం వల్ల ఢిల్లీ జట్టు బలంగా తయారవుతుంది. కోహ్లీ ఎన్ని మ్యాచ్లు ఆడతారనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, జట్టు ఆడబోయే ఆరు మ్యాచ్లలో కనీసం రెండు మ్యాచ్లకు ఆయన అందుబాటులో ఉంటారని సమాచారం. విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం కోహ్లీకి కూడా ప్రయోజనకరం.
దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత, భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది. జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. దీనికి ముందు కోహ్లీకి దాదాపు ఒక నెల విరామం లభిస్తుంది. విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం ద్వారా ఆయన తన బ్యాటింగ్ ఫామ్ ను, మ్యాచ్ ఫిట్నెస్ను కొనసాగించవచ్చు.