అభిమానుల్లో ఆందోళన.. పెళ్లి నిజంగానే రద్దయ్యిందా?
ఇంతకుముందు వరకూ ఉత్సాహంగా పెళ్లి వేడుకలను ప్రారంభం నుంచి ఫాలో అవుతున్న అభిమానులు ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు. పెళ్లి పూర్తి ఆగిపోయిందా? అనే చర్చ సాగుతోంది. అలాగే, కొందరు యూజర్లు.. ఇన్ని సమస్యలు పెళ్లికి ముందే వస్తే, తర్వాత ఏమవుతుందో? స్మృతి తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో మరింత ఇబ్బందులను తప్పించడానికేనా? ఇరు కుటుంబాల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలా ఉన్నాయా? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు స్మృతి మంధాన గానీ, ఆమె కుటుంబసభ్యులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా, ఇద్దరూ 2019 నుంచి లవ్ లో ఉన్నప్పటికీ, వారి ప్రేమ కథ 2023లోనే పబ్లిక్కు తెలిసింది. వన్డే వరల్డ్ కప్ తర్వాత డివై పాటిల్ స్టేడియం ప్రపోజల్ వీడియో వైరల్ అయింది. ఇలాంటి ప్రేమ కథ ఇప్పుడు అనుకోని పరిస్థితులతో కొత్త మలుపు తిరిగింది. స్మృతి తండ్రి ఆరోగ్యం మెరుగుపడడం, పలాష్ కోలుకోవడం తర్వాతే పెళ్లిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అభిమానుల ఆందోళనలు, ఊహాగానాలు మాత్రం ఆగేలా కనిపించడం లేదు.