స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ పెళ్లికి బ్రేక్.. ఎందుకంటే?

Published : Nov 23, 2025, 04:59 PM ISTUpdated : Nov 23, 2025, 06:03 PM IST

Smriti Mandhana Palash Muchhal wedding: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నవంబర్ 23న జరగాల్సిన స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడింది.

PREV
13
స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ పెళ్లిలో షాక్

టీమిండియా మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన జీవితంలో నవంబర్ 23వ తేదీ ఒక ప్రత్యేకమైన రోజు కావాల్సి ఉంది. మహారాష్ట్రలోని సాంగ్లిలో సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా మంధాన ఇంట్లో మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు సందడి చేస్తున్నాయి. సన్నిహితులు, క్రికెట్ సహచరులు, కుటుంబ సభ్యుల అందరితో పండుగ వాతావరణం నెలకొంది.

అయితే, పెద్ద వేడుకకు కేవలం గంటలు ముందు జరిగిన ఒక అనూహ్య సంఘటన ఈ ఆనందాన్ని పూర్తిగా చెరిపేసింది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో కుటుంబంలో కలకలం రేగింది. ఇంటికి అంబులెన్స్ రావడంతో అతిథులు, బంధువులు ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయారు.

అంబులెన్స్‌లోనే ఆయనను వెంటనే సాంగ్లిలోని ఒక ఆసుపత్రికి తరలించడంతో, ఇంట్లో జరుగుతున్న వివాహ ఏర్పాట్లు ఒక్క క్షణంలోనే ఆగిపోయాయి. పెళ్లి వాయిదా పడింది. 

23
తండ్రి పూర్తిగా కోలుకున్నాకే పెళ్లి: స్మృతి

స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా ఈ విషయం పై వివరణ ఇస్తూ.. “శ్రీనివాస్ మంధాన ఉదయం అల్పాహారం చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. మొదట సాధారణ సమస్య అనుకున్నాం. కానీ కొద్దిసేపటికి ఆయన పరిస్థితి మరింత దిగజారింది. వెంటనే ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు” అని తెలిపారు.

అయితే, స్మృతి ఈ పరిస్థితుల్లో పెళ్లి వేడుక కొనసాగించడం ముఖ్యంకాదని భావించింది. “తండ్రి ఆరోగ్యం మెరుగుపడేదాకా ఏ వేడుకను చేసుకోనని స్మృతి చాలా స్పష్టంగా చెప్పింది. అందుకే వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేసింది” అని తుహిన్ మిశ్రా వెల్లడించారు. మంధాన కుటుంబం గోప్యతను గౌరవించాలని ఆయన మీడియాను, అభిమానులను అభ్యర్థించారు.

33
స్నేహితుల హాజరు, క్రికెటర్ల మధ్య వేడుకల సందడి

ఈ పెళ్లి వేడుకలకు క్రికెట్ ప్రపంచం కూడా పెద్ద సంఖ్యలో హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. జెమిమా రోడ్రిగ్స్, షఫాలి వర్మ, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ వంటి ప్లేయర్లు ఇప్పటికే సాంగ్లికి చేరుకున్నారు. హల్దీ వేడుకలో స్మృతి తన సహచరులతో చేసిన నృత్య వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అదే కాకుండా, పెళ్లి వేడుకలకు వినూత్నతను జోడిస్తూ “బ్రైడ్ టీమ్ vs గ్రూమ్ టీమ్” పేరుతో సరదా క్రికెట్ మ్యాచ్ కూడా నిర్వహించడంతో అందరూ నవ్వులు పూయించారు.

ఈ ఉత్సాహభరిత వేడుకలు మంధాన, పలాష్ జంట నిశ్చితార్థాన్ని ఎలా ప్రకటించారో గుర్తు చేశాయి. స్మృతి ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా ఈ వార్తను అభిమానులకు తెలియజేసింది. తరువాత ముంబై డివై పాటిల్ స్టేడియంలో పలాష్ చేసిన రొమాంటిక్ ప్రపోజల్ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ప్రస్తుతం పెళ్లి వాయిదా పడటంతో కొత్త తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశముంది.

Read more Photos on
click me!

Recommended Stories