స్మృతి మంధాన గణాంకాలు ఆమె నిలకడకు అద్దం పడుతున్నాయి. టెస్టు క్రికెట్లో 7 మ్యాచుల్లో 629 పరుగులు చేశారు, ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 117 మ్యాచుల్లో 5322 పరుగులు సాధించగా, అందులో 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక టీ20 ఫార్మాట్లో 157 మ్యాచుల్లో 4102 పరుగులు చేసి, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కొనసాగుతున్నారు. టాప్ ఆర్డర్లో వచ్చి ఇన్నింగ్స్ను నిర్మించడంతో పాటు, వేగంగా పరుగులు రాబట్టడం మంధాన ప్రత్యేకత.
తిరువనంతపురంలో జరిగే ఈ ఆఖరి పోరులో మంధాన 62 పరుగులు చేస్తే, ఈ ఏడాది టాప్ స్కోరర్ కిరీటం ఆమె సొంతమవుతుంది. శ్రీలంక బౌలింగ్ను ఎదుర్కొని ఆమె ఈ ఘనత సాధిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉన్న టీమిండియాకు, మంధాన రికార్డు అదనపు బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. అభిమానులందరి కళ్లు ఇప్పుడు స్మృతి మంధాన బ్యాటింగ్పైనే ఉన్నాయి.