సోనమ్ యెషీ ఈ ఘనత సాధించడానికి ముందు, టీ20 ఇంటర్నేషనల్స్లో 7 వికెట్లు తీయడమే అత్యుత్తమ రికార్డుగా ఉండేది. ఇలా ఆరు సార్లు జరిగింది. పురుషుల టీ20లో మలేషియాకు చెందిన సిజ్రుల్ ఇద్రుస్ 2023లో చైనాపై 8 పరుగులిచ్చి 7 వికెట్లు తీయగా, బహ్రెయిన్కు చెందిన అలీ దావూద్ 2025లో భూటాన్పై 19 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు.
మహిళల విభాగంలో ఇండోనేషియాకు చెందిన రోహమలియా మంగోలియాపై 0 పరుగులకే 7 వికెట్లు తీయగా, నెదర్లాండ్స్ బౌలర్ ఫ్రెడరిక్ ఓవర్డిక్ 3 పరుగులిచ్చి 7 వికెట్లు, అర్జెంటీనాకు చెందిన అలిసన్ స్టాక్స్ 3 పరుగులిచ్చి 7 వికెట్లు, సైప్రస్కు చెందిన సమంతీ దునుకెడెనియా 15 పరుగులిచ్చి 7 వికెట్లు తీశారు.
అలాగే దేశవాళీ టీ20లలో కూడా 7 వికెట్లు తీసిన సందర్భాలు ఉన్నాయి. 2019లో లీసెస్టర్షైర్కు చెందిన కాలిన్ అకెర్మాన్ 18 పరుగులిచ్చి 7 వికెట్లు తీయగా, 2025లో దర్బార్ రాజ్షాహి తరఫున తస్కిన్ అహ్మద్ 19 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టారు. సోనమ్ యెషీ ఈ రికార్డులన్నింటినీ అధిగమించి, 8 వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు.