ఐపీఎల్ కమిటీ నవంబర్ 15న అన్ని ఫ్రాంచైజీల రిటెన్షన్, రిలీజ్, ట్రేడ్ వివరాలను ప్రకటించింది. ఇందులో కేకేఆర్ నిర్ణయాలు ప్రత్యేకంగా హైలైట్ అయ్యాయి. అనుభవజ్ఞులు, యంగ్ ప్రతిభతో కూడిన జట్టు నిర్మాణం స్పష్టంగా కనిపించింది. కేకేఆర్ రిటైన్ చేసిన ఆటగాళ్లలో అజింక్య రహానే, రఘువంశి, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీశ్ పాండే, రమణ్ దీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిలు ఉన్నారు.
జట్టుకు మొత్తం 13 స్లాట్లు వుండగా, అందులో 6 విదేశీ ఆటగాళ్ల స్లాట్లు ఉన్నాయి. కేకేఆర్ టీమ్ పర్స్ మొత్తం ₹64.3 కోట్లుగా ఉంది.