సెమీఫైనల్ ఉత్కంఠ.. భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయి?
1. రెండు మ్యాచ్లు గెలిస్తే నేరుగా సెమీస్ కు భారత్
భారత్ న్యూజీలాండ్, బంగ్లాదేశ్పై గెలిస్తే ఇతర ఫలితాలు ఎలా ఉన్నా సెమీఫైనల్లోకి నేరుగా అర్హత సాధిస్తుంది. ఇది అత్యంత సురక్షిత మార్గం.
2. న్యూజీలాండ్తో ఓడితే కష్టమే
భారత్ న్యూజీలాండ్ తో జరిగే మ్యాచ్ లో ఓడితే పరిస్థితి క్లిష్టమవుతుంది. ఆ సందర్భంలో న్యూజీలాండ్ ఇంగ్లండ్తో తుదిమ్యాచ్లో ఓడిపోవాలి. అదే సమయంలో భారత్ బంగ్లాదేశ్పై విజయం సాధించాలి.
3. న్యూజీలాండ్పై గెలిచి, బంగ్లాదేశ్ తో ఓడితే
ఈ పరిస్థితిలో భారత్ మళ్లీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. భారత్ న్యూజీలాండ్ను ఓడించి, బంగ్లాదేశ్ తో ఓడిపోతే ఇంగ్లండ్తో చివరి మ్యాచ్లో న్యూజీలాండ్ ఓడిపోవాలని ఆశించాలి. చివరికి నెట్ రన్రేట్ ఆధారంగా (భారత్ లేదా న్యూజీలాండ్) ఒక జట్టు సెమీఫైనల్లోకి వెళ్తుంది.