చైనా వెయిట్ లిఫ్టర్‌కి డోపింగ్ టెస్టు... అదే రుజువైతే మీరాాబయికి గోల్డ్ మెడల్ ఖాయం...

First Published Jul 26, 2021, 3:13 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా భారత జట్టు ఖాతాలో చేరింది ఒకే ఒక్క రజత పతకం.  వెయిట్‌ లిఫ్టింగ్ మహిళల 49 కేజీల విభాగంలో మణిపూర్ మణిపూస మీరాభాయ్ ఛాను రజతం సాధించింది. అయితే ఆమె పతకం, స్వర్ణంగా మారే ఛాన్సులు ఉన్నాయి...

49 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన చైనా వెయిట్ లిఫ్టర్ హూ జీహూయ్, డ్రగ్స్ వాడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు నిర్వహికులు...
undefined
స్నాచ్ రౌండ్‌లో అలవోకగా 94 కేజీలు ఎత్తిన హు జీహుయ్, ఆ తర్వాతి రౌండ్‌లో 109, 114, 116 కేజీలను అలవోకగా ఎత్తేసింది. మిగిలిన అథ్లెట్లు స్వల్పంగా ఇబ్బందిపడినట్టు కనిపించినా జీహుయ్ మాత్రం ఎక్కడా అలా అనిపించలేదు...
undefined
స్నాచ్‌లో 94, క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో 116 కేజీలు, మొత్తంగా 210 కేజీలను లిఫ్ట్ చేసి ఒలింపిక్ రికార్డు క్రియేట్ చేసిన హు జీహుయ్‌ను యాంటీ డోపింగ్ అధికారులు పరీక్షించనున్నారు.
undefined
ఒకవేళ హుజీహుయ్, నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు నిర్ధారణ అయితే, ఆమెపై అనర్హత వేటు పడుతుంది. రెండో స్థానంలో ఉన్న భారత వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ ఛానుకి స్వర్ణం దక్కుతుంది... అదే జరిగితే ఒలింపిక్‌లో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారత వెయిట్ లిఫ్టర్‌గా చరిత్ర సృష్టిస్తుంది మీరాభాయ్..
undefined
మూడో స్థానంలో ఉన్న ఇండోనేషియా వెయిట్ లిఫ్టర్ విండీ కాండీకా అయిషాకు దక్కిన కాంస్య పతకం, రజతంగా మారుతుంది...
undefined
పురుషుల వెయిట్ లిఫ్టింగ్‌లో కూడా 61 కేజీలు, 67 కేజీల విభాగాల్లో చైనాకే స్వర్ణ పతకాలు దక్కడం విశేషం. 61 కేజీల విభాగంలో లీ ఫ్యాబిన్, 67 కేజీల విభాగంలో చెన్ లిజున్ పసిడి పతకాలు గెలిచారు.
undefined
click me!