ఆధ్యాత్మిక కారణాలు
పూర్వకాలంలో మట్టికుండ నీళ్ళను చాలా పవిత్రంగా భావించేవారు. అందులో చేయి పెట్టడం వల్ల అపవిత్రమవుతుందంటారు. అందుకే మట్టి కుండలను మళ్లీ నీళ్లలోనే ముంచి శుభ్రం చేసేవారు.
వాస్తు ప్రకారం ఇంటి వస్తువులను శుభ్రంగా, ఒక వరుస క్రమంలో ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. మట్టికుండలో తరచుగా చేయి పెట్టడం వల్ల అపరిశుభ్రంగా మారి పాడైపోతుందని నమ్ముతారు.