చాణక్య నీతి శ్లోకం
విద్యార్థి సేవకః పాన్థః క్షుధార్తో భయకాతరః।
భండారి ప్రతిహారి చ సప్త సుప్తాన్ ప్రబోధయేత్॥
దీనర్థం ఏంటంటే.. విద్యార్థి, సేవకుడు, ప్రయాణికుడు, ఆకలితో ఉన్నవాడు, భయపడుతున్నవాడు, వంటవాడు, కాపలాదారుడు, ఈ ఏడుగురు నిద్రిస్తుంటే వెంటనే లేపాలి.
విద్యార్థులు ఎక్కువసేపు నిద్రపోకూడదు
చాణక్య నీతి ప్రకారం విద్యార్థుల ఏకైక లక్ష్యం చదువుకోవడం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత విద్యార్థులపై ఉంటుంది. అందువల్ల విద్యార్థులు చదువుకునే సమయంలో నిద్రపోకూడదు. అదే అతనికి మంచిది.