Lord Shiva: పశుపతి లింగం మాయమైతే కలియుగం అంతమైనట్టేనా? ఆ లింగం ఎక్కడుందో తెలుసా?

Published : Apr 01, 2025, 06:21 PM IST

Lord Shiva: కలియుగం అంతమైపోతుందని ఎప్పటి నుంచో ఎన్నో రకాల కథలు, వార్తలు ప్రచారంలో ఉన్నాయి కదా. అలాంటి ఓ ఆసక్తికర విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే పశుపతినాథ్ దేవాలయంలో శివలింగం నీట మునుగుతుందో కలియుగం అంతం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ పశుపతినాథ్ ఆలయం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా? 

PREV
15
Lord Shiva: పశుపతి లింగం మాయమైతే కలియుగం అంతమైనట్టేనా? ఆ లింగం ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలోనే కాకుండా నేపాల్ లో కూడా శివుడిని విశేషంగా పూజిస్తారు. ఇండియాలో దేశవ్యాప్తంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అంటే 12 చోట్లు శివుడి ఆత్మలింగం ఉద్భవించిందన్న మాట. మరి నేపాల్ లో శివుడికి సంబంధించిన విశేషాలు ఏమున్నాయో ఇప్పడు తెలుసుకుందాం. 

 

25

నేపాల్ రాజధాని కాఠ్మాండూలో పశుపతినాథ్ గుడి ఉంది. కలియుగం అంతానికి ఈ ఆలయానికి సంబంధం ఉందని స్థల పురాణాలు, స్థానికుల మాటల ద్వారా తెలుస్తుంది. పశుపతినాథ్ ఆలయంలో శివ లింగం కాకుండా శివుని ముఖ రూపాన్ని మనం చూడొచ్చు. 

శివుడి అనుగ్రహం పొందాలంటే కేదార్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించాలని పండితులు చెబుతారు. అయితే కేదారనాథ్ తో పాటు పశుపతినాథ్ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవాలని అంటారు. ఎందుకంటే పశుపతినాథ్ శివుని శక్తి కేంద్రం అని నేపాల్ వాసులు బాగా నమ్ముతారు. 

35

మరి కలియుగం అంతానికి, పశుపతినాథ్ ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి? భూమి మీద హింస, దోపిడీ, అన్యాయం పెరిగిపోతోంది. ఇదంతా కలియుగం అంతానికి సూచన అని పండితులు చెబుతుంటారు. కలియుగం చివరి దశకు చేరుకున్నప్పుడు పశుపతినాథ్ గుడిలోని శివలింగం పక్కనే ఉన్న బాగమతి నదిలో మునుగుతుందట. ఇది జరిగితే యుగం మారిపోతుందని నేపాల్ వాసులు గట్టిగా నమ్ముతారు.


 

45

పశుపతినాథుని లింగాకారమే ఈ భూమికి రక్ష అని, ఆ లింగం బాగమతి నది నీటిలో మునిగిపోతే కలియుగం అంతమైనట్టేనని స్థల పురాణం చెబుతుంది. పశుపతినాథ్ గుడిలో శివుడు ఉన్నంతవరకు కలియుగపు చెడు శక్తులు భూమిని ఏమీ చేయలేవు. పశుపతినాథుడు అక్కడి నుంచి కదిలితే భూమికి అంతమేనని చెబుతారు. 

ఇది కూడా చదవండి మీ ఇంటి గుమ్మాలు ఇలా ఉంటే ఎంత అదృష్టమో.. దేనికీ తిరుగుండదు!

55

పశుపతినాథ్ లో శివుడు ఎలా వెలిశాడంటే..

పశుపతినాథ్ లో శివలింగం ఉద్భవించిన ఘటనపై ఎన్నో కథలు ఉన్నాయి. ఒకసారి శివుడు జింక రూపంలో బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు వచ్చి కైలాసానికి రావాలని పిలిచారట. ప్రార్థన చేసిన అనంతరం జింకను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ పొరపాటున దాని కొమ్ముని పట్టుకొన్నారు. దీంతో అది విరిగి అక్కడే శివలింగంగా మారిపోయిందట. శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడ శివలింగంపై పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి చూసి ప్రజలకు ఈ విషయం చెప్పగా, ఆలయం కట్టి పూజలు చేయడం ప్రారంభించారు. 

Read more Photos on
click me!

Recommended Stories