భగవద్గీత మానవ జీవితానికి మార్గాన్ని చూపే పవిత్రమైన గ్రంథం. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన శ్లోకాలతో ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు.. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సవాళ్ళను ఎదుర్కోవడానికి మార్గ నిర్దేశం చేస్తాయి. ఆ శ్లోకాలు ఇవే..
““ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన | మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి ||
అర్థం: కర్మ చేసే అధికారం మాత్రమే నీది, దాని ఫలితాన్ని శాసించే హక్కు నీది కాదు. ఫలితాల గురించి ఆలోచించకుండా మీ కర్తవ్యం, ప్రయత్నాలపై దృష్టి పెట్టండి.
ప్రేరణ: ఇది మనల్ని నిష్కపటంగా వ్యవహరించమని, ఫలితాన్ని ఉన్నత శక్తికి వదిలివేయమని నేర్పుతుంది, విజయం లేదా వైఫల్యం గురించి ఆందోళనను తగ్గిస్తుంది.
25
న జాయతే మ్రియతే వా కదాచిన్...”
“ న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః | అజో నిత్యః శాశ్వతోஉయం పురాణో, న హన్యతే హన్యమానే శరీరే || ”
అర్థం: ఆత్మకి పుట్టినదీ లేదు, మరణమూ లేదు. ఇది ఎప్పుడూ ఉనికిలోకి రాదు, ఎప్పుడూ నశించదు. ఇది అజము, నిత్యము, శాశ్వతము, ప్రాచీనమైనది. శరీరాన్ని హతమార్చినప్పటికీ, ఆత్మ హతమార్చబడదు.
ప్రేరణ: ఈ శ్లోకం కష్టాల్లో బలాన్నిస్తుంది, ఘోర వైఫల్యం లేదా భయం ఎదురైనా మన ఆత్మ నాశనం చేయలేనిదని గుర్తు చేస్తుంది.
అర్థం: గాలి వీచని ప్రదేశంలో దీపం ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును.
ప్రేరణ: ఏదైనా కఠిన పరిస్థితి ఎదురైనప్పుడు గందరగోళానికి గురికాకుండా.. ఏకాగ్రత ద్వారా అంతర్గత ప్రశాంతతను పెంపొందవచ్చు. మనం స్థిరంగా, ఉద్దేశ్యపూర్వకంగా ఉండటానికి సహాయపడుతుంది.