శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన అయోధ్య
శ్రీరామనవి వేడుకలకు అంగరంగా వైభవంగా జరిపేందుకు అయోధ్యను సర్వాంగ సుందంగా తీర్చిదిద్దారు. ఆదివారం ఒక్క రోజే అయోధ్యకు సుమారు 20 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆలయ ట్రస్ట్ అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేసి, తాగునీరు, 14 తాత్కాలిక ఆరోగ్యకేంద్రాల్లో ఓఆర్ఎస్ వంటివి అందుబాటులో ఉంచింది. వైద్యులు, ఏడుచోట్ల 108 అంబులెన్సులను సిద్ధం చేసింది. ఇక, డ్రోన్ల సాయంతో సరయూ నది జలాలను భక్తులపై జల్లనున్నారు.