చాలా మంది మహిళలు అన్ని విషయాల్లో మౌనం వహిస్తారు. తమ మనసులో ఉంది అనే విషయాన్ని తొందరగా బయట పెట్టరు. దీని కారణంగా వారి అవసరాలు, అంచనాలు భర్తకు ఎలా తెలుస్తాయి..? తెలియకపోవడం వల్ల వారికి నచ్చిన పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులు మీకు నచ్చకపోవచ్చు. ఫలితంగా.. దంపతుల మధ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి.. అన్ని విషయాల్లో మౌనంగా ఉండకపోవడమే మంచిది. మీకు ఏం కావాలో మీరే స్వయంగా చెప్పాలి. మహిళలు మౌనంగా ఉండి, మౌనంగా వ్యవహరించినప్పుడు, అది సంబంధంలో అసంతృప్తికి , ఆగ్రహం పెరగడానికి దారితీస్తుంది, ఇది ఉద్రిక్తతకు , సంఘర్షణకు దారితీస్తుంది. అంతేకాదు, మహిళలు తమ భావాలను వ్యక్తపరచలేనప్పుడు, అది వారికి , వారి జీవిత భాగస్వామికి మధ్య దూరాన్ని సృష్టిస్తుంది. తర్వాత విడాకుల దాకా దారితీయవచ్చు.