అమ్మ బాబోయ్.. ప్రేమించిన ప్రియుడికోసం.. కన్నవారిపైనే వీడియో

First Published Jul 27, 2020, 12:42 PM IST

వారి కులాలు వేరు కావడంతో ఇద్దరూ పారిపోయి వివాహం చేసుకున్నారు. అయితే.. ఖుష్బూ కుమారి తల్లిదండ్రులు యువకుడితో సహా నలుగురిపై కిడ్నాప్ కేసు పెట్టారు.
 

వాళ్లిద్దరూ ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. వారి కులాలు వేరు కావడంతో.. వారి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. వారు లేచిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇక్కడితో వీరి కథ సుఖాంతం కాలేదు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
undefined
ఈ మేరకు ఓ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియో సదరు యువతి కంట కూడా కూడా పడింది.
undefined
తన ప్రియుడిపై పేరేంట్స్ వీడియో తీయడమే కాకుండా.. తన భర్త కుటుంబసభ్యులపై కేసు పెట్టడాన్ని యువతి తట్టుకోలేకపోయింది. వెంటనే.. మరో వీడియో విడుదల చేసింది. ఈ వీడియో కూడా వైరల్ కావడం గమనార్హం. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
undefined
బిహార్ రాష్ట్రం లాల్గంజ్ పోలీస్ స్టేషన్‌లోని పంచదామియా గ్రామంలో నివసిస్తున్న శుష్బు కుమారి, తన సొంత గ్రామానికి చెందిన శివశంకర్ పాస్వాన్ అనే యువకుడిని ప్రేమించింది.
undefined
వారి కులాలు వేరు కావడంతో ఇద్దరూ పారిపోయి వివాహం చేసుకున్నారు. అయితే.. ఖుష్బూ కుమారి తల్లిదండ్రులు యువకుడితో సహా నలుగురిపై కిడ్నాప్ కేసు పెట్టారు.
undefined
సోషల్ మీడియాలో షుష్బు కుమారి తల్లిదండ్రుల వీడియో వైరల్ కావడంతో కేసు మరింత స్ట్రాంగ్ అయ్యింది. అయితే.. ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. ఈ వీడియో తరువాత, ఖుష్బూ కుమారి తన తల్లిదండ్రులు విభ దేవి , శ్రీకాంత్ సింగ్ లకు వ్యతిరేకంగా మరో వీడియో విడుదల చేసింది.
undefined
తనని ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తన తల్లిదండ్రులు తప్పుడు కేసులు పెట్టారంటూ మరో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
undefined
అంతేకాకుండా... తన పేరంట్స్, తన మేనమామ కలిసి.. తన అత్తగారి కుటుంబాన్ని సమస్యల్లోకి నెట్టాలని చూస్తున్నారని ఆ వీడియోలో మండిపడింది. తన ఇష్టపూర్వకంగానే తాను పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఆ వీడియోలో వివరించింది.
undefined
ఈ వీడియో కూడా వైరల్ గా మారడంతో.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పో తెలియకుండా పోయింది. దీంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ రెండు వీడియోలను పరిశీలించారు. ఈ వీడియోల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని వారు చెప్పారు. ఇప్పటి వరకు అయితే.. ఎలాంటి యాక్షన్ ఎవరిమీదా తీసుకోకపోవడం గమనార్హం.
undefined
click me!