వారు చెప్పింది పట్టించుకోకపోవడం
చాలా మంది తల్లిదండ్రులు తాము చెప్పిందే పిల్లలు వినాలంటారు.. కానీ పిల్లలు చెప్పిన మాట మాత్రం చెవిన పెట్టరు. కొంతమంది ఏదో విన్నామా అనిపిస్తే.. మరికొంతమంది మాత్రం అసలు పిల్లలు చెప్పనీయరు. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసన్ని తగ్గిస్తుంది. పిల్లల పెంపకంపైనే మీ పిల్లలు ఎలా ఉన్నారనేది ఆధారపడి ఉంటుంది. అసలు చాలా మంది పిల్లలకు ఏం కావాలో విడిచిపెట్టి.. నువ్వు ఇది చేయకూడదు. అది చేయాలని అని చెప్తుంటారు. ఇది వారి మనస్సుపై ప్రభావితం చూపిస్తుంది. దీనివల్ల మీ పిల్లలు సైలెంట్ అవుతారు.