ఇదొక్కటి చేసినా మీ పిల్లల కళ్లు బాగా కనిపిస్తాయి

First Published Sep 19, 2024, 5:47 PM IST

నేటికాలం పిల్లలు మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడ్డారు. స్కూల్ నుంచి రాగానే ఫోన్ లో ముఖం దూరుస్తారు. కానీ ఫోన్ వల్ల పిల్లల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ముఖ్యంగా కంటిచూపు చాలా తగ్గుతుంది. 
 

రోజంతా మొబైల్ ఫోన్లును, టీవీని చూడటం పిల్లలకు ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఈ అలవాటు పిల్లల కంటిచూపును తగ్గిస్తుంది. పిల్లలకు తోడు పెద్దలు కూడా ఫోన్లకు అత్తుకునే ఉంటున్నారు. పెద్దవాళ్లను చూసి కూడా పిల్లలు ఫోన్లకు బాగా అడిక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా పేరెంట్సే టీవీలో కర్టూన్ లు పెట్టి పిల్లల్ని టీవీ ముందు కూర్చోబెడుతున్నారు.

కానీ టీవీ, ఫోన్ స్క్రీన్ వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే కళ్లు కూడా దెబ్బతింటాయి. టీవీ, ఫోన్లను ఎక్కువగా చూసే పిల్లలకు కళ్లు సరిగ్గా కనిపించవు. కాబట్టి పిల్లల కంటిచూపును మెరుగుపర్చడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మీ పిల్లల కంటి చూపును మెరుగుపరచాలనుకుంటే ముందుగా వారు ఫోన్లను, టీవీ ని ఎక్కువగా చూడకుండా చేయాలి. ఒకవేళ పిల్లలు ఆ అలవాటును మానకపోతే ఫోన్లను చూడటం వల్ల వచ్చే సమస్యలేంటో చెప్పండి. దీంతో వారికి భయం కలుగుతుంది. ఫోన్లను ఎక్కువగా చూడొద్దన్న ఆలోచన వస్తుంది. 

Latest Videos


kids

కళ్లకు విశ్రాంతి చాలా అవసరం. కానీ కరోనా కాలం నుంచి పిల్లలు ఫోన్ లోనే చదువుకున్నారు. పాఠాలు విన్నారు. దీంతో పిల్లలు రోజంతా ఫోన్లను చూస్తూ వచ్చారు. ఈ అలవాటు పిల్లల్ని ఫోన్లకు బానిసలుగా చేసింది. కానీ ఇది పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మీ పిల్లలు ఫోన్లలో ఎక్కువగా చదువుకోకుండా చేయండి. 

Kids food

పిల్లలు ఎక్కువ సేపు ఫోన్ చూడటం వల్ల వారి కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది మొదట్లో ఎలాంటి హాని చేయదు. కానీ రానురాను మీ పిల్లల కళ్లు కనిపించకుండా చేస్తుంది. కాబట్టి మీ పిల్లలు ఫోన్లు ఎక్కువ సేపు చూడకుంా చేయండి. మీ పిల్లల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే ఖచ్చితంగా హాస్పటల్ కు తీసుకెళ్లండి. 


ఆహారం

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని చికిత్సలు ప్రభావవంతంగా ఉంటాయి. అయినప్పటికీ కొన్ని ఆహార మార్పులు కూడా చేయాలి. ఎందుకంటే ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లను చూడటం వల్ల కళ్లు పొడిబారుతాయి. ఇలా కాకూడదంటే మీ పిల్లలకు వాల్ నట్స్, సోయా బీన్స్, ఒమేగా 3 ఎక్కువగా ఉండే చేపలను పెట్టండి.

వీటితో పాటుగా విటమిన్ సి పుష్కలంగా ఉండే క్యారెట్, నారింజ పండ్లను కూడా వారి రోజువారి ఆహారంలో చేర్చండి. వీటిలో ఉండే అవసరమైన విటమిన్లు, పోషకాలు యూవీ కిరణాల నుంచి కళ్లను రక్షిస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. 

click me!