5. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది
పగటిపూట కంటే రాత్రిపూట చదివితే పిల్లలు మానసిక ఒత్తిడికి గురికారు. అలాగే ఈ సమయంలో పిల్లల మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చదివి నిద్రపోవడం వల్ల బాగా నిద్రపడుతుంది. అంటే చదివింది అయిపోగానే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది. ఎలాంటి టెన్షన్ ఉండదు. అంతేకాకుండా పిల్లల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
6. ఎక్కువ శ్రద్ధ
ఉదయం, పగటిపూట చదివేటప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫోన్, సోషల్ మీడియా ఇలా.. చాలా వాటిపై మన ఇంట్రెస్ట్ మళ్లుతుంటుంది. దీనివల్ల చదువుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి రాత్రిపూట చదివితే ఇదేం ఉండదు. పూర్తి శ్రద్ధతో చదువుపై పిల్లలు దృష్టి పెడతారు.