2024 రిపోర్టు ప్రకారం.. 180 దేశాల జాబితాలో భారత్ 96వ స్థానంలో నిలిచింది. భారత్ సాధించిన స్కోరు 100కు గాను 38 మాత్రమే.
గత ఏడాదితో పోలిస్తే భారత్ పనితీరు కొంచెం నిరాశాజనకంగా ఉంది. కిందటి సంవత్సరం భారత్ 93వ ర్యాంకులో ఉండగా, ఈసారి మూడు స్థానాలు దిగజారి 96కు చేరింది. ప్రభుత్వ రంగంలో పారదర్శకత లేకపోవడం, అవినీతి నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయడంలో ఉన్న సవాళ్లే ఈ తగ్గుదలకు కారణమని రిపోర్టు విశ్లేషించింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అవినీతిని అరికట్టడంలో మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
అట్టడుగున ఉన్న దేశాలు ఇవే
ఒకవైపు డెన్మార్క్, ఫిన్లాండ్ వంటి దేశాలు నిజాయితీకి మారుపేరుగా నిలుస్తుంటే, మరోవైపు కొన్ని దేశాలు తీవ్రమైన అవినీతి, అశాంతి, బలహీనమైన ప్రభుత్వ వ్యవస్థలతో సతమతమవుతున్నాయి. ఈ జాబితాలో చివరి స్థానాల్లో ఉన్న దేశాలు ఇవే:
- 178వ ర్యాంక్: వెనిజులా (స్కోరు: 10)
- 179వ ర్యాంక్: సోమాలియా (స్కోరు: 9)
- 180వ ర్యాంక్: దక్షిణ సూడాన్ (స్కోరు: 8)
ఈ దేశాల్లో నిరంతర ఘర్షణలు, రాజకీయ అస్థిరత, సంస్థాగత వైఫల్యాలే అవినీతి పెరిగిపోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.