ఆనందాన్ని ఎలా నిర్ణయిస్తారు.?
నివేదిక ప్రకారం ఒక దేశం శ్రేయస్సును నిర్ణయించడానికి అనేక పేరామిటర్స్ ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా, పరస్పర నమ్మకం, సామాజిక బంధం, ఆరోగ్యం, స్వేచ్ఛ కూడా పరిగణలోకి తీసుకుంటారు. దేశ ప్రజలను వారి జీవితాల గురించి కూడా ప్రశ్నలు అడుగుతారు. భారతదేశం, పాకిస్తాన్ విషయానికొస్తే, సర్వే నమూనా పరిమాణం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిజానికి పాకిస్తాన్ జనాభా భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కంటే కొంచెం ఎక్కువ. కాగా భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. అటువంటి పరిస్థితిలో రెండు దేశాల నమూనా పరిమాణంలో పెద్ద వ్యత్యాసం ఉంది.