Ginger Capital of India : ఇండియాలో నాణ్యమైన అల్లం ఎక్కడ పండుతుందో తెలుసా..? ఇటీవలే నీతి ఆయోగ్ ఆ రాష్ట్రాన్ని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా గుర్తించింది.
Ginger Capital of India : భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి జనాభాలో 70-80 శాతంమంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆదారపడి జీవించేవారే. దేశ ఆర్థిక వ్యవస్ధలో కూడా వ్యవసాయమే కీలక పాత్ర పోషిస్తోంది.
అయితే దేశంలో ఒక్కోరాష్ట్రం ఒక్కో పంటకు ప్రసిద్ది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వరి ఎక్కువగా పండిస్తారు కాబట్టి వీటిని 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా' అని... ఉత్తర ప్రదేశ్ లో చెరకు ఎక్కువ కాబట్టి ''షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా'' అని...పంజాబ్ లో గోదుమలు ఎక్కువగా పండిస్తారు కాబట్టి ''వీట్ బౌల్ ఆఫ్ ఇండియా'' అని పిలుస్తారు.
అయితే ఇటీవల నీతి ఆయోగ్ ఓ రాష్ట్రాన్ని'జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా' గా గుర్తించింది. అయితే ఎక్కువ ఉత్పత్తి ఆధారంగా కాకుండా మంచి నాణ్యత కలిగిన అల్లం పండించడం ఆధారంగా ఈ గుర్తింపు లభించింది. ఇలా భారతీయులు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంను చాలా రాష్ట్రాలు పండిస్తాయి... కానీ నాణ్యమైన అల్లం పండిస్తూ ఈ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
25
జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది..?
ప్రపంచంలో అల్లం అత్యధికంగా పండించే దేశం ఇండియానే. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిచేసే అల్లంలో 40 శాతం కేవలం ఇండియాదే. ఇలా దేశంలో పండించే అల్లం స్థానిక అవసరాలకు ఉపయోగించడమే కాదు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఇండియన్ అల్లంకు చాలాదేశాల్లో డిమాండ్ ఉంది. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ పంటను ఎక్కువగా పండించేలా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే నీతి ఆయోగ్ ఈశాన్య రాష్ట్రం మిజోరాంను జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించింది.
35
మిజోరాంకే ఎందుకు ఈ గుర్తింపు..?
ఇండియాలో అత్యధికంగా అల్లం పండించే రాష్ట్ర మధ్యప్రదేశ్. మరి మిజోరాంను ఎందుకు జింజర్ క్యాపిటల్ గా ప్రకటించారు అనేగా మీ డౌట్..? అయితే అన్ని పంటల విషయంలో ఎక్కువ ఉత్పత్తి చేసిన రాష్ట్రాలకే ప్రత్యేక గుర్తింపు లభించింది... కానీ అల్లం విషయంలోనే నాణ్యత ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రపంచంలో ఎక్కుడాలేని విధంగా మిజోరాంలో పండే అల్లం చాలా ప్రత్యేకమైనది... దీని ఆరోమా గానీ, టేస్ట్ గాని అద్భుతం. ఇది వేరే ఎక్కడ పండే అల్లంలో ఉండదు... అందుకే దీనికింత ప్రత్యేక గుర్తింపు.
మిజోరాం రాష్ట్రం కొండకోనలతో కూడిన ప్రాంతం. ఇక్కడి రైతులు ఎక్కువగా కొండ అంచులు, ఎత్తుపల్లాలు కలిగిన భూముల్లో వ్యవసాయం చేస్తుంటారు. ఇలాంటి భూములు అల్లం పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి. అల్లం పంటకు నీరు నిల్వ ఉండకూడదు, కానీ తేమ ఉండాలి... మిజోరాం కొండ అంచుల్లో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి... కాబట్టి నాణ్యమైన అల్లం పండుతుంది.
మిజోరాంలో వర్షాలు కూడా అల్లం పంటకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడి భూములు, వ్యవసాయ పద్దతులు, వాతావరణ పరిస్థితులన్నీ నాణ్యమైన అల్లం పండించేందుకు ఉపయోగపడుతున్నాయి. అందుకే అల్లం ఉత్పత్తి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇలా మిజోరాం అల్లం కేవలం జాతీయస్థాయిలోనే కాదు ప్రపంచస్థాయిలో ప్రత్యేకంగా నిలిచింది... నాణ్యతలో టాప్ ప్లేస్ సాధించింది.
55
వెల్లుల్లి అత్యధికంగా పండించే రాష్ట్రమేది..?
అల్లం, వెల్లుల్లి కలిస్తేనే భారతీయ వంటకాలకు రుచి వచ్చేది. ఇండియాలో ఈ రెండింటిని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం మధ్య ప్రదేశ్. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే వెల్లుల్లిలో 60-65 శాతం కేవలం మధ్య ప్రదేశ్ లోనే పండుతుంది. ఇక రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ లో కూడా వెల్లుల్లిని ఎక్కువగా పండిస్తారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చైనా తర్వాత అత్యధికంగా వెల్లుల్లిని ఉత్పత్తిచేసే దేశం ఇండియానే.