ఒంటరిగా గర్జించే సింహం నేను.. 2026 ఎన్నికలపై విజయ్ సంచలన ప్రకటన

Published : Aug 21, 2025, 11:13 PM IST

TVK Vijay: 2026 తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని టీవీకే అధ్యక్షుడు, యాక్టర్ విజయ్ స్పష్టం చేశారు. మధురై ఈస్ట్‌ నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు. మానాడులో విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయాల్లో హీటును పెంచాయి.

PREV
15
టీవీకే మహానాడులో విజయ్ గర్జన

తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై తన భవిష్యత్‌ ప్రణాళికను స్పష్టంగా వెల్లడించారు. మధురైలో గురువారం నిర్వహించిన టీవీకే రెండో మహానాడులో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

"సింహం ఎప్పుడూ ఒంటరిగానే గర్జిస్తుంది. అది అడవిలో రాజు. మిగతా జంతువులు ఎన్ని ఉన్నా దాని స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు" అంటూ ఆయన తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. ఈ సభకు సుమారు నాలుగు లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు హాజరై ఉత్సాహపరిచారు.

DID YOU KNOW ?
తమిళగ వెట్రి కజగం (టీవీకే)
తమిళగ వెట్రి కజగం (TVK) భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజకీయ పార్టీ. నటుడు విజయ్ 2024 ఫిబ్రవరి 2న స్థాపించిన ఈ పార్టీ ప్రధాన కార్యాలయం చెన్నై పనైయూర్ 8వ అవెన్యూలో ఉంది.
25
2026లో ఎన్నికల్లో విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని విజయ్ ముందుగానే ప్రకటించారు. మధురై ఈస్ట్ నుంచి తాను బరిలో దిగుతానని స్పష్టంగా చెప్పారు. "టీవీకే కార్యకర్తలు 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు. మీరు ఎవరికీ కాదు, నాకే ఓటేస్తున్నారు అనుకోవాలి" అంటూ సందేశం ఇచ్చారు. ఇది పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

35
డీఎంకేపై విజయ్ ఘాటు విమర్శలు

డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ను విజయ్ తీవ్రంగా విమర్శించారు. "ప్రజలకు తప్పుడు హామీలు ఇస్తూ మోసం చేస్తున్నారు. మహిళలకు రూ.1,000 ఇచ్చి సరిపోతుందనుకుంటున్నారా? రైతులు, మత్స్యకారులు కష్టాల్లో ఉన్నారు" అంటూ ఆయన నిప్పులు చెరిగారు. 2026లో డీఎంకేను అధికారంలో నుంచి దింపాలని టీవీకే కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

45
బీజేపీపై విజయ్ హాట్ కామెంట్స్

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు పై కూడా విజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. "తమిళుల సమస్యలను బీజేపీ విస్మరించింది. NEET సమస్య, కచ్చతీవు దీవి, మత్స్యకారుల ఇబ్బందులు.. ఇలా ఏవీ పరిష్కరించలేకపోయారు" అంటూ విజయ్ విమర్శించారు. బీజేపీ భావజాల శత్రువు, డీఎంకే రాజకీయ శత్రువు అంటూ కామెంట్ చేశారు. "టీవీకే ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు. ఒంటరిగానే.. స్వయం శక్తితోనే పోటీ చేస్తుంది" అని తెలిపారు.

55
టీవీకే లక్ష్యాలు, భవిష్యత్ దిశను వివరించిన విజయ్

మానాడులో విజయ్ తన పార్టీ టీవీకే లక్ష్యాలను కూడా వివరించారు. "మహిళలు, యువకులు, రైతులు, కూలీలు, మత్స్యకారులు, వృద్ధులు.. ఇలా అందరి సంక్షేమమే మా లక్ష్యం" అన్నారు. అధికారం కోసం కాదు.. తాను ప్రజల కోసమే రాజకీయంలోకి వచ్చానని చెప్పారు. 

ప్రజా సమస్యల పరిష్కారమే తమ దిశ అని వివరించారు. "నిజాయితీ ఉన్న నాయకుడు కావడం ముఖ్యం. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను" అని విజయ్ చెప్పారు.

విజయ్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో వేడి పెరిగింది. బీజేపీ, డీఎంకే రెండింటినీ లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను కదిలించాయి. 

మధురై ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేయడం, అలాగే అన్ని నియోజకవర్గాల్లో టీవీకే పోటీ చేస్తుందని ప్రకటించడం రాష్ట్ర ఎన్నికల్లో కొత్త సమీకరణలకు దారితీస్తోంది. మరి రాబోయే ఎన్నికల్లో విజయ్ ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories