రేపు ఛత్తీస్ఘడ్లో మూడు ప్రాజెక్టులకు మోడీ భూమి పూజ: వన్యప్రాణుల కోసం ఇలా...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులను ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.7, 500 కోట్ల ప్రాజెక్టు పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు.
24
రేపు ఛత్తీస్ఘడ్లో మూడు ప్రాజెక్టులకు మోడీ భూమి పూజ: వన్యప్రాణుల కోసం ఇలా...
రాయ్పూర్- విశాఖపట్టణం ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
జాతీయ రహదారి ప్రాజెక్టుల అభివృద్ధిలో వన్యప్రాణుల సంచారం కోసం ఏర్పాట్లు చేశారు. జంతువుల సంచారం కోసం 27 మార్గాలను ఏర్పాటు చేశారు. కోతులు వెళ్లేందుకు వీలుగా 17 మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు 2.8 కిలోమీటర్లతో సొరంగ మార్గంలో ఆరులైన్ల రహదారిని నిర్మించనున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం కారణంగా వన్యప్రాణులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
34
రేపు ఛత్తీస్ఘడ్లో మూడు ప్రాజెక్టులకు మోడీ భూమి పూజ: వన్యప్రాణుల కోసం ఇలా...
ఈ విషయమై ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో అడవులు, అడవుల్లో ఉండే వన్యప్రాణులకు ఇబ్బంది కల్గించేలా పాలకులు వ్యవహరిస్తుంటారు.
44
PM Narendra Modi to inaugurate, lay foundation stones of projects worth Rs 7,500 crore in Chhattisgar lns
కానీ దీనికి భిన్నంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ కు ప్రధాని మోడీ 2021 డిసెంబర్ లో శంకుస్థాపన చేశారు. ఆసియాలోనే అతిపెద్ద వన్యప్రాణుల ఎలివిటేడ్ కారిడార్ ఇది.