ఈ బ్రెజిల్ పర్యటన ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనలో మూడో పర్యటన ఇది. ఆయన ఇప్పటికే ఘానా, ట్రినిడాడ్ & టొబాగో పర్యటనలు పూర్తి చేశారు.
ఇది ప్రధానిగా నరేంద్ర మోడీకి నాలుగోసారి బ్రెజిల్ పర్యటన కావడం గమనార్హం. 2014లో తొలి పర్యటన అనంతరం, 2019 BRICS సదస్సు, 2024లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఆయన బ్రెజిల్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈసారి పర్యటన ప్రత్యేకతలు గమనిస్తే.. ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేయడం. వాణిజ్యం, ఇంధన రంగం, వాతావరణ మార్పు, రక్షణ వంటి కీలక రంగాల్లో సహకారం పైన దృష్టి పెట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.