మీకు పీఎం కిసాన్ డబ్బులు రాకపోడానికి ఇవే కారణమే ఉండొచ్చు :
1. ఈ-కేవైసీ సమస్య : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లాభం పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. మీరు ఇంకా ఈ-కేవైసీ చేయకపోయినా లేదా మీ సమాచారం తప్పుగా ఉన్నా అకౌంట్లో డబ్బులు పడవు.
2. బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ : ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ ను లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇలా బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేకపోతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వొచ్చు. ఇది మీకు కిసాన్ డబ్బులు పడకపోడానికి కారణం కావచ్చు.
3. డీబీటీ సదుపాయం లేకపోవడం : మీ బ్యాంక్ ఖాతాలో డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) సేవ యాక్టివ్ గా లేకపోతే డబ్బు ట్రాన్స్ఫర్ కాదు. అంటే ఇలా ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకే డబ్బులు అందించే పథకాలను డిబిటి తప్పనిసరి. కాబట్టి మీ అకౌంట్ లో డిబిటి యాక్టివ్ గా ఉందో లేదో చూసుకొండి.
4. భూమి ధృవీకరణ పూర్తి కాకపోవడం : చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు భూయాజమాన్య అర్హత కోసం భూమి ధృవీకరణ తప్పనిసరి చేశారు. ఇది పూర్తికాకపోవడం కూడా పీఎం కిసాన్ డబ్బులు పడకపోడానికి కారణం కావచ్చు.
5. వివరాలు అప్డేట్ చేయకపోవడం : బ్యాంక్ లేదా ఆధార్ సమాచారంలో మార్పులు, అప్డేట్ చేయకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వివరాలను సరిచూసుకొండి.
ఇలా మీకు పిఎం కిసాన్ డబ్బులు పడకపోడానికి ఏదయినా కారణం కావచ్చు. అదేంటో మీరే కనుక్కోవాలి. ఆ సమస్యను పరిష్కరించుకున్నారో మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు నష్టపోతారు.