పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇలా చేయండి.. e-KYC తప్పనిసరి
పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు పొందాలంటే e-KYC తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది.
OTP ఆధారిత e-KYC ప్రక్రియయను ఇలా పూర్తి చేయండి..
1. pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్లండి.
2. పై భాగంలో ఉన్న ‘e-KYC’ ఆప్షన్పై క్లిక్ చేయండి.
3. ఆధార్ నంబర్ ఇవ్వండి.
4. మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కి OTP వస్తుంది.
5. దాన్ని ఎంటర్ చేసి ధృవీకరించగానే e-KYC పూర్తవుతుంది.
ముఖ గుర్తింపు (Face Authentication) పద్ధతి
• PM-KISAN Mobile App, Aadhaar Face RD App డౌన్లోడ్ చేసుకుని, మొబైల్ ద్వారా e-KYC పూర్తి చేయవచ్చు.
• ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ముఖాన్ని స్కాన్ చేసిన వెంటనే ప్రక్రియ పూర్తవుతుంది.
e-KYC పూర్తి చేయని రైతులకు పీఎం కిసాన్ నిధులు రావని ప్రభుత్వం తెలిపింది.