ఇది సారస్వత బ్రాహ్మణ సంప్రదాయాలకు ముఖ్య కేంద్రం. గోవాలో అత్యంత ప్రశాంతంగా, ప్రకృతితో నిండిన ఆధ్యాత్మిక ప్రదేశం ఇది. 370 ఏళ్లుగా మఠం ఇక్కడే కొనసాగుతూ వేలాది మంది భక్తుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది. రామాయణం, వేదాధ్యయనం, సాంప్రదాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన రామ విగ్రహం, రామాయణ థీమ్ పార్క్తో పర్యాటకంగా కూడా ప్రధాన ఆకర్షణగా మారింది.
మఠం గురించి విశేషాలు
గోకర్ణ జీవోత్తమ మఠం గోవా రాష్ట్రం.. దక్షిణ గోవాలోని పర్తిగలి గ్రామంలో ఉంది. కుశ్వవటి నది ఒడ్డున ఉన్న చాలా ప్రశాంతమైన స్థలంలో ఇది ఉంది. ఇది గౌడ్ సారస్వత్ బ్రాహ్మణుల (GSB) ఆధ్యాత్మిక కేంద్రం. ఈ మఠం చరిత్ర 1475 సంవత్సరంలో ప్రారంభమైంది. మొదటి గురువు శ్రీ నారాయణ తీర్థ స్వామిజీ. తర్వాత వచ్చిన జీవోత్తమ తీర్థ స్వామిజీ కారణంగా ఈ మఠం “జీవోత్తమ మఠం” అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇప్పటివరకు అనేక గురువులు/స్వామిజీలు ఈ మఠాన్ని నడిపారు.
ఈ మఠంలో ఏం చేస్తారు.?
* వేదాలు నేర్పడం
* పూజలు, హోమాలు, జపాలు నిర్వహించడం
* గౌడ్ సారస్వత్ సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శనం
* గ్రంథాలయం, విద్యా కార్యకలాపాలు
* సేవా కార్యక్రమాలు