ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ… ఇటీవల పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న వారిని ఇంటెలిజెన్స్ శాఖ ఇప్పటికే గుర్తించినట్టు వెల్లడించారు.
ఈ దాడి, జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ఉద్దేశించిందేనని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడే మొదలైనదని, ఇది ఇంకా కొనసాగుతుందని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించామని వారు తెలిపారు.
పహల్గాం దాడిలో 25 మంది భారతీయులను, ఒక నేపాలీని చంపేశారు. ముంబైలోనూ 9/11 ఘటనలోనూ చాలా మంది అమాయకులు చనిపోయారు. ఇప్పటి వరకు భారత్ లో జరిగిన అతి పెద్ద ఘటన ఇదే అని కేంద్ర ప్రకటించింది.
ముఖ్యంగా పహల్గాం దాడిలో కుటుంబ సభ్యుల మధ్యనే అత్యంత దారుణంటా.. చంపేశారని కేంద్ర వివరించింది. ఇకపై ఇలాంటి ఉగ్ర వాదుల ఆగడాలను ఏమాత్రం సహించేది లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు.
ఉగ్రవాదుల పాకిస్తాన్ అంతర్జాతీయ సంస్థలను తప్పుదోవ పట్టించిందని మిశ్రా పేర్కొన్నారు.పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తు ఉన్నా..దానిని ఆపేయాలని చాలాశాంతంగా ,అనేక సార్లు పలు దౌత్యమార్గాల ద్వారా అడిగినప్పటికీ వారి తీరు మారలేదు. పాక్ వినకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందన్నారు.తీవ్ర వాదులు భారత్ లోకి రావడానికి భయపడే విధంగా తాజా దాడులను తీవ్రవాదుల స్థావరాల పై నిర్వహించమని తెలిపారు.
తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యం చేసుకుని వాటిని ధ్వంసం చేశామని .. కల్నల్ సోఫియా ఖురేషి అన్నారు. ఈ క్యాంపులు పాకిస్తాన్, పీవోకేలో ఉన్నాయని తెలిపారు. ట్రైనింగ్ క్యాంపుల వివరాలను వీడియో రూపంలో ప్రదర్శించారు. ఇలాంటి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వివరించారు. విశ్వసనీయ ఇంటెలిజెన్స్ ఇచ్చిన వివరాల ఆధారంగా.. ఈ దాడులు చేశామన్నారు. సామన్య పౌరులకు వారి ఆస్తులకు ఏమాత్రం నష్టం జరుగకుండా దాడులు చేశామని వివరించారు.
మురిడ్కేలోని మర్కజ్ తయ్యబాపై ఆర్మీ మెరుపు దాడులు లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ హతం. మాలిక్తో పాటు మరో ఉగ్ర నేత ముదాసిర్ కూడా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.