నాగేంద్రన్ ఎంకకు ఇదే మెయిన్ రీజన్ :
నయనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో పొత్తు చర్చలు జరిపి అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీలను కూటమిలోకి తీసుకురావాలని బీజేపీ భావించింది. ఇది కాకుండా నయనార్ నాగేంద్రన్ బీజేపీ అధ్యక్షుడిగా కావడానికి మరో ముఖ్య కారణం ఉంది. బీజేపి కన్యాకుమారి ప్రాంతంలో బలంగా ఉన్నప్పటికీ ఇతర దక్షిణ జిల్లాల్లో అంత బలం లేదు.
ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో గణనీయంగా ఉన్న దేవార్, నాడార్ సామాజిక వర్గాల ఓట్లు బీజేపీకి ఎక్కువగా లేవు. దీంతో ఆ ఓట్లను దృష్టిలో ఉంచుకుని దక్షిణ జిల్లాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు నయనార్ నాగేంద్రన్కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓపీఎస్, టీటీవీ దినకరన్ వంటి వారు అన్నాడీఎంకే నుంచి విడిపోయి ఉండటంతో దేవార్ సామాజిక వర్గం ఓట్లు చీలిపోయి డీఎంకేకు ఎక్కువగా వెళ్తున్నాయి.
ఈ ఓట్లన్నింటినీ కలిపి బీజేపీకి వచ్చేలా అదే సామాజిక వర్గానికి చెందిన నయనార్ నాగేంద్రన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. నయనార్ నాగేంద్రన్కు దక్షిణ జిల్లాల్లో మంచి పలుకుబడి ఉంది. ఏ శుభకార్యం ఉన్నా, సంతాప కార్యక్రమం ఉన్నా, గుడిలో ప్రత్యేక పూజలు ఉన్నా అక్కడ ప్రజలతో కలిసి ఉండటం ఆయనకు అలవాటు