ఈ విధానం అమల్లోకి వస్తే కంపెనీలపై రీసైక్లింగ్ వ్యయం మూడు రెట్లు పెరగనుందని, దీని ప్రభావం ఉత్పత్తుల ధరలపై పడే అవకాశం ఉందని కంపెనీలు కోర్టు ముందుకు వెళ్లాయి. మరీ ముఖ్యంగా టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు వంటి పెద్ద ఎలక్ట్రానిక్స్ పై సంస్థలు భారీగా ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఈ-వేస్ట్ దేశంగా
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఈ-వేస్ట్ ఉత్పత్తిదారుగా ఉంది. కానీ ఇందులో ఎక్కువ శాతం అనధికార రీసైక్లింగ్ ద్వారా జరుగుతుంది. కొత్త పాలసీలో ఈ నిబంధనల వల్ల వ్యయ భారం కంపెనీలపై పడుతుంది కానీ, నిషిద్ధ రీసైక్లింగ్పై మాత్రం ప్రభావం తక్కువగా ఉంటుందని కంపెనీలు వాదిస్తున్నాయి.