తెలుగోళ్లకు పండగే పండగ...
ఇప్పటికే వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి... దీంతో ఆటోమేటిగ్గా నిత్యావసరాల ధరలు కూడా మండిపోతున్నాయి. దీంతో యావత్ దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం మందుబాబులకు చల్లని కబురు చెప్పింది. ఈ రాష్ట్రంలో బీర్ల ధరలను భారీగా తగ్గించింది... కొన్ని బ్రాండ్లపై రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.75 వరకు ధర తగ్గింది.
ఎండలు మండిపోతున్న వేళ చల్లటి బీర్ తాగాలనుకునేవారికి ధరల తగ్గింపుతో పండగే. ముఖ్యంగా బీర్ ప్రియులకు సంబరాలు చేసుకునేంత ఆనందంలో ఉన్నారు. అయితే కేవలం కన్నడ ప్రజలకే కాదు కొందరు తెలుగోళ్లకు కూడా బీర్ల ధరల తగ్గింపుతో ఉపశమనం లభించనుంది.
కర్ణాటక బార్డర్లోని తెలంగాణ జిల్లాలు నారాయణపేట, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి ప్రజలు కర్ణాటక వెళ్లి తక్కువధరలో బీర్లు తాగే అవకాశం ఉంటుంది. ఇక కర్ణాటకతో బార్డర్ పంచుకునే ఏపీ జిల్లాలు కర్నూల్, చిత్తూరు, అనంతపురం ప్రజలకు కూడా బీర్ల ధరలు తగ్గింపు ఉపయోగపడనుంది. ఇలా కర్ణాటకకు అత్యంత సమీపంలోని తెలుగు ప్రాంతాల మందుబాబులకు బీర్ల ధరల తగ్గింపుతో డబ్బులు ఆదా కానున్నాయి. ఇది వారికి మరింత కిక్ ఇవ్వనుంది.