POKపై పాక్ ఆక్రమణ ఎలా జరిగింది?
1947లో స్వాతంత్య్ర సమయంలో జమ్మూ కాశ్మీర్ రాజు హరి సింగ్ పాలనలో ఉండేది. ఆర్థిక భారం పెరగడంతో స్థానిక ముస్లింలలో అసంతృప్తి చెలరేగింది. ఇదే సమయంలో పాక్ష్టూన్లు కాశ్మీర్లోకి చొచ్చుకొచ్చారు. భయపడిన రాజు హరి సింగ్ భారతదేశాన్ని ఆశ్రయించి, విలీన ఒప్పందంపై సంతకం చేశాడు. దీంతో భారత సైన్యం పాకిస్తాన్ మద్దతుదారులను వెనక్కు పంపింది.
అయితే అప్పటికే పాకిస్తాన్ గిల్గిట్, బాల్టిస్తాన్తో పాటు మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించేసింది. తర్వాత నెహ్రూ ఐక్యరాజ్యసమితికి వెళ్లారు. అక్కడ సదరు దేశాలు తమ సైనిక దళాలు ఉపసంహరించుకోవాలని తీర్మానం తీసుకున్నా పాకిస్థాన్ అమలు చేయలేదు.