Published : Jul 17, 2025, 04:48 PM ISTUpdated : Jul 17, 2025, 04:51 PM IST
మేకిన్ ఇండియా నినాదం కేవలం పారిశ్రామిక రంగానికి మాత్రేమ పనిమితం కాకుండా రక్షణ రంగానికి కూడా విస్తరిస్తోంది. ఇండియన్ ఆర్మీలో అధునాతన ఆయుధాలను భారత్లోనే తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఆర్మీలోకి కొత్త ఆయుధం రానుంది.
భారత సైన్యం కోసం రష్యాతో కలిసి తయారుచేస్తున్న AK-203 రైఫిల్ను ‘షేర్’ అని పేరు పెట్టారు. హిందీలో 'షేర్' అంటే సింహం. ఇది ధైర్యానికి, శక్తికి, రక్షణకు ప్రతీక. 2025 డిసెంబర్ నాటికి ఈ ఆయుధాన్ని సైన్యానికి అందించబడనున్నారు. ఇది ఇండియన్ ఆర్మీ ఇన్ఫెంట్రీ విభాగానికి ప్రధాన ఆయుధంగా ఉపయోగపడనుంది.
25
రూ. 5,200 కోట్ల ఒప్పందంతో లక్షల రైఫిళ్లు
2021లో భారత్-రష్యా దేశాల మధ్య రూ. 5,200 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. దీని కింద 6,01,427 AK-203 రైఫిళ్లు తయారుచేసి ఇండియన్ ఆర్మీకి సరఫరా చేయాల్సి ఉంది. 48,000 రైఫిళ్లు ఇప్పటికే సరఫరా అయ్యాయి, వాటిలో 50% స్థానికంగా తయారయ్యాయి.
35
ఉత్పత్తి వేగవంతం
IRRPL సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ ఎస్.కె. శర్మ ప్రకారం, 2025 డిసెంబర్ 31నాటికి పూర్తిగా భారతదేశంలో తయారైన మొదటి AK-203 రైఫిల్ను ‘షేర్’గా విడుదల చేస్తారు. వచ్చే 5 నెలల్లో 70,000 రైఫిళ్లు సరఫరా చేస్తామన్నారు, వాటిలో 70% లోకల్ కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా, 2032 డెడ్లైన్కి ముందే, 2030 మధ్య నాటికి అన్ని రైఫిళ్లు పంపిణీ చేసే లక్ష్యం పెట్టుకున్నారు.
IRRPL చెబుతున్న సమాచారం ప్రకారం, ఆసియా, ఆఫ్రికా దేశాలు భారత్లో తయారయ్యే AK-203పై ఆసక్తి చూపిస్తున్నాయి. అంతేకాక, 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ శాఖలు, పారామిలిటరీ సంస్థలు కూడా ఈ రైఫిళ్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. 2026 నుంచి ఏటా 1.5 లక్షల రైఫిళ్లు తయారు చేయబోతున్నారు. అందులో 1.2 లక్షలు ఆర్మీకి, 30,000 ఇతర అవసరాలకు కేటాయించనున్నారు.
55
‘షేర్’ ప్రత్యేకతలు ఎన్నెన్నో
AK-203 రైఫిల్ వజన్ 3.8 కిలోలు మాత్రమే. పాత AK-47తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇందులో టెలిస్కోపిక్ స్టాక్, మోడ్రన్ ఆప్టిక్స్కు అనుకూలత, కిక్బ్యాక్ తక్కువగా ఉండేలా ప్రత్యేక డిజైన్ చేశారు. 7.62×39mm చాంబర్తో పనిచేసే ఈ రైఫిల్ను మెరుగైన పర్సిషన్, తక్కువ బరువు, సులభంగా నిర్వహించగలిగే విధంగా రూపొందించారు.