ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడిన ఖవాజా ఆసిఫ్, “పహల్గాం ఘటన తర్వాత భారతదేశం క్షేత్రస్థాయిలో తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలు తగ్గేలా కనీస సూచనలు కనిపించడం లేదు.
శాంతికి భారత్ ఒప్పుకుంటుందనే ఆశా కనిపించడంలేదు. ఎలాంటి దాడులు జరిగినా, పాకిస్థాన్ కూడా తగిన రీతిలో ప్రతిస్పందిస్తుంది. దీనిపై ఎలాంటి సందేహం లేదు. పరిస్థితి భారత్ చర్యలపై ఆధారపడి ఉంటుంది,” అన్నారు.
అలాగే, “ఇరు దేశాల మధ్య సయోధ్యకు దేవుడే దారి చూపించాలని కోరుకుంటున్నా. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి,” అని చెప్పారు.