మోదీ కీలక సమావేశాలు
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సీసీఎస్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో హోం మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అజిత్ ధోవల్ పాల్గొన్నారు.
ఇందులో పాక్ కు ఐఎంఎఫ్ నిధులను ఎలా నియంత్రించాలన్న అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం మోదీ నేతృత్వంలో సీసీపీఏ సమావేశం.. తర్వాత సీసీఈఏ (విదేశీ వ్యవహారాలపై కేబినెట్ సమావేశం) పూర్తి స్థాయి కేబినెట్ సమావేశం జరుగనున్నాయి.