చైనా ఇప్పటికే $14 బిలియన్ క్వాంటం పరిశోధనలో పెట్టుబడి పెట్టింది, భారత్ మాత్రం కొత్తగా మొదలుపెడుతోంది. మనకు మేధస్సు ఉన్నా, ఫండింగ్, వేగం, ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఇంకా మెరుగుకావాల్సి ఉంది. క్వాంటం టెక్నాలజీతో భారత్.. సైబర్ యుద్ధాలు, ఉపగ్రహ నెట్వర్క్ భద్రత, అండర్వాటర్ నావిగేషన్ రంగాల్లో దూసుకుపోనుంది. భవిష్యత్లో ఇది సివిలియన్ రంగాల్లో కూడా (హెల్త్కేర్, ఫైనాన్స్, స్పేస్) విస్తరించే అవకాశం ఉంది.