సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ మహిళ.. స్థానికంగా మహిళా గ్రూప్ లీడర్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల గ్రూప్ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసి బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లింది.
అందులో నకిలీ రూ. 500 నోటును గుర్తించిన బ్యాంకు అధికారులు మందలించి, ఆ నోటును చించి పడేశారు. దీంతో సదరు గ్రూప్ లీడర్ ఆ రూ. 500 నష్టపోవాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి.