EPFO 3.0 కోసం సంస్థను కోర్ బ్యాంకింగ్ మోడల్లోకి తీసుకురావడానికి సమగ్ర డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రేమ్వర్క్ను ఆమోదించారు. ఇందులో క్లౌడ్ ఆధారిత సేవలు, ఏపీఐ మాడ్యూల్స్, బహుభాషా స్వీయ సేవా ఫీచర్లు ఉండనున్నాయి.
కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ సిస్టమ్స్లో..
• రిటర్న్ ఫైలింగ్ మాడ్యూల్: యజమానుల ఫైలింగ్ సులభతరం చేయడానికి తీసుకొచ్చారు
• యూజర్ మేనేజ్మెంట్ మాడ్యూల్ : భద్రతా మెరుగుదల కోసం తీసుకొచ్చారు
• ఈ-ఆఫీస్ సిస్టమ్ 7.0 : వేగవంతమైన ఫైల్ ప్రాసెసింగ్ కోసం ఈ సేవలు ప్రారంభించారు
• SPARROW : ఆన్లైన్ పనితీరు మూల్యాంకన వ్యవస్థ ఇది
ఈ సంస్కరణలు ఈపీఎఫ్ఓలో పారదర్శకత, ఆటోమేషన్ తో పాటు సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలను అందించడాన్ని బలోపేతం చేస్తాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.